Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రైతు రుణమాఫీకి రంగం సిద్ధం!

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:23 IST)
తెలంగాణలో రైతు రుణమాఫీకి రంగం సిద్ధమవుతోంది. 2018 డిసెంబర్‌ 11నాటికి ఉన్న రుణాల్లో లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలిదశలో రూ. 25వేల లోపు ఒకేసారి పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.

రుణమాఫీకి సంబంధించి రెండురోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. రైతు రుణమాఫీకి రంగం సిద్ధం బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు కేటాయించిన సర్కార్‌... ఈ మేరకు అమలు దిశగా కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రూ. 25వేలలోపు రుణాలకు సంబంధించి ఈ నెలలోనే చెక్కులు అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

2018 డిసెంబర్‌ 11నాటికి ఉన్న రుణాల్లో రూ. లక్ష వరకు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు 40 లక్షల మంది.. ఇందులో భాగంగా రుణం మొత్తం ఆధారంగా రైతులను ఐదు విభాగాలుగా చేశారు. రూ. 25వేల లోపు మాత్రమే అప్పు ఉన్న 5.83 లక్షల మంది పేర్లతో బ్యాంకులు జాబితాలు సిద్ధం చేశాయి.

వీరంతా ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత నిరుపేదలై ఉంటారని తొలుత వీరికి మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం 40లక్షల 66వేల మంది రైతులకు బ్యాంకుల్లో రూ. 25వేల 936కోట్లు బకాయిలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments