ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్- 35 కనీస మార్కులు వేసి పాస్ చేస్తారా?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:36 IST)
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా లాంటి కాలంలో జరిగిన పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంపై దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో.. విద్యార్థులు అందరినీ పాస్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఫెయిల్‌ అయిన విద్యార్థులకు.. 35 కనీస మార్కులు వేసే విషయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫెయిల్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది 5నుంచి 10 శాతం మార్కులు మాత్రమే సాధించారు. 
 
ఆన్‌లైన్‌ క్లాస్‌ ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులు అందరినీ ఇంటర్‌కు ప్రమోట్‌ చేయడం మరో కారణం అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 
దీంతో ప్రస్తుతం ఫెయిల్‌ అయిన విద్యార్థులు అందరినీ.. కనీస మార్కులతో పాస్‌ చేయడం తప్ప.. మరో మార్గం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments