Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర మంత్రిపై తేనెటీగల దాడి

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (08:41 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తేనెటీగల దాడి జరిగింది. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. 
 
అయితే, మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువు నిర్వహించారు. ఈ క్రతువులో పాల్గొన్న మంత్రి పువ్వాడ తదితరులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆలయ వేదపండితులు, మంత్రి సెక్యూరిటీ సిబ్బందిని కూడా వదిలిపెట్టలేదు. 
 
అయితే, మంత్రిని తేనెటీగలు కుట్టినప్పటికీ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్ నగరానికి తరలించారు. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
తనపై అనుకోని రీతిలో తేనెటీగల దాడి జరిగిందనీ, రెండు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూసించారని తెలిపారు. పైగా, తాను క్షేమంగానే ఉన్నట్టు కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments