Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని.. యూటీ చేసే ఆలోచన.. కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (10:44 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
 
అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. శనివారం నాడు లోక్‌సభలో జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రసంగించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ను యూటీ చేసినా చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై తాజాగా హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి స్పందించారు. యూటీ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేలోపే అసదుద్దీన్ లోక్‌సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్‌లో‌ ఉన్న హైదరాబాద్‌‌ను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments