Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై 22 ఇంచుల టీవీ పడింది... అంతే మృతి

Webdunia
గురువారం, 19 మే 2022 (13:21 IST)
ఆడుకుంటూ వుండిన చిన్నారిపై టీవీ పడటంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ ఫస్ట్‌ ల్యాన్సర్‌కు చెందిన ఎండీ లయీజుద్దీన్‌ కార్పెంటర్‌. అతడి కుమార్తె మెహ్రాజ్‌ ఫాతిమా (2) ఆడుకుంటోంది. ఆమె అల్లరి పనులను తల్లిదండ్రులు సంబరంగా చూస్తున్నారు. 
 
తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లిన ఫాతిమా టీవీ స్టాండ్‌కు తగిలింది. దీంతో దాని మీద ఉన్న 22 ఇంచుల టీవీ ఆమెపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి స్పృహ తప్పింది. వెంటనే తల్లిదండ్రులు విజయ్‌నగర్‌కాలనీలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అనంతరం బంజారాహిల్స్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు తలకు శస్త్ర చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments