Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా ఉందనీ.. ఆ కిరాతక భర్త ఏం చేశాడంటే...

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (09:17 IST)
సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు తలెత్తడం సహజమే. కొన్ని క్షణాల్లో అవన్నీ సర్దుకునిపోతాయి. కానీ, ఇక్కడ ఆ మనస్పర్థలే ఓ వివాహిత దారుణ హత్యకు కారణమయ్యాయి. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాకు చెందిన యోగి, అరుణ యువతీయువకులు ఆర్నెల్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ కలిసి మియాపూర్‌లో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీనికి కారణం భార్య నల్లగా ఉండటమే. ఈ ఒక్క కారణంతో మంగళవారం సాయంత్రం ఆమెను అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం యోగి కూడా గొంతుకోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 
 
ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది. అయితే.. ప్రేమించిన యువతితోకాకుండా మేనకోడలితో పెద్దలు పెళ్లి చేయడంతో భార్యను యోగి వేధించసాగాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments