Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదు

Webdunia
బుధవారం, 17 మే 2023 (16:40 IST)
హైదరాబాద్ నగరంలో తొలి లిక్కర్ అలెర్జీ కేసు నమోదైంది. ఈ తరహా కేసులు నమోదుకావడం ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ తరహా లిక్కర్ అలెర్జీ కేసును వైద్యులు గుర్తించారు. ఆగ్రాకు చెందిన జాన్ (36) అనే వ్యక్తికి మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆయన ముఖం ఎర్రబడటంతో వైద్యులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఆయన నగరంలోని ఓ ప్రైవేటు అలెర్జీ సెంటర్‌కు చికిత్స కోసం వెళ్లగా, ఈ అలెర్జీ కేసు వెలుగు చూసింది. ఆయన్ను పరిశీలించిన వైద్యుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ లిక్కర్ అలెర్జీగా గుర్తించారు. ఈ తరహా కేసులు ప్రపంచ వ్యాప్తంగా మహా అయితే, వంద వరకు ఉండొచ్చని తెలిపారు. 
 
అయితే, జాన్‌కు ఈ అలెర్జీ రావడానికి కారణాలను విశ్లేషిస్తే, కొన్ని నెలల క్రితం జాన్ ఓ విందు పార్టీకి వెళ్లి అక్కడ మద్యం సేవించాడు. ఆ తర్వాత ముఖంపై వేడిగా ఉండటంతో అద్దంలో చూసుకోగా, ఎర్రబడినట్టు కనిపిచింది. చర్మంపై దురదలు, ఛాతీ పట్టేసినట్టు అనిపించడంతో ఆస్పత్రిలో చేరి చికిత్సతో నయం చేసుకున్నాడు. కొంతకాలానికి మళ్లీ మద్యం సేవించడంతో తిరిగి అదే సమస్య ఉత్పన్నమైంది. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చి అశ్విని అలెర్జీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయగా, అలెర్జీ కేసుగా నమోదైంది. మద్యం సేవించిన తర్వాత ఈ తరహా అలెర్జీలు కనిపిస్తే తాగకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments