Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపరిచితుల ఫోన్‌ వస్తే వెంటనే మాకు సమాచారమివ్వండి: సైబరాబాద్‌ పోలీసులు

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:27 IST)
ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడి మోసపోకుండా ఉండటానికి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ల గురిం చి ఆరా తీయడానికి, నిజానిజాలు తెలసుకోవడానికి సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్‌ చేసుకోవడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక ల్యాండ్‌లైన్‌, మరొక మొబైల్‌తో హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్‌ క్రైమ్‌పై అవగాహన ఉన్న సిబ్బందిని ఉదయం 9:00 నుంచి రాత్రి 8:00 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ప్రజల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్‌ చేసుకొని వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. తద్వారా ప్రజలు సైబర్‌ నేరాల బారినపడకుండా, నేరగాళ్ల చేతికి చిక్కి రూ. లక్షల్లో నష్టపోకుండా ముందుగానే నివారించొచ్చు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్లను సైబర్‌ క్రైమ్‌ విభాగం వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోన్‌లోనే కాకుండా.. నెటి జన్లు ఆన్‌లైన్‌లో కూడా సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
 
సంప్రదించాల్సిన  ఫోన్‌ నంబర్‌లు..
మొబైల్‌ నంబర్‌- 9490617310
ల్యాండ్‌లైన్‌ - 04027854031
sho-cybercrimes@tspolice.gov.in
NCR Portal:https://cybercrime.gov.in

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments