Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (12:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4,59,228 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే, పరీక్షా హాలుకు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. 
 
సోమవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకుగానూ కోవిడ్ నిబంధనలను అనుసరించి, 1,768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ విధుల్లో కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వారినే నియమించారు. 
 
ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసోలేషన్ రూంలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు కరోన భారిన పడితే వారికి తరవాత పరీక్ష రాసే అవకాశం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. 
 
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా పరీక్ష రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారి కోసం మానసిక నిపుణులను ఏర్పాటు చేశామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ….కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటి ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments