Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డే.. ఇందులో ఎలాంటి మార్పు లేదు: నాయిని

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (11:52 IST)
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది రానున్న ఎన్నికల్లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గెలిచి.. సీఎం పీఠంపై కూర్చుంటారన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీకి చిరునామా గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని తెలిపారు. 
 
కేసీఆర్‌ను ఓడించడం ఎవరితరమూ కాదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలతో టీఆర్ఎస్‌ను పోల్చి చూస్తే.. ఎవరు బాగా పాలించారో తెలుస్తుందని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాయిని గుర్తు చేశారు.
 
ఇదిలా ఉంటే... తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఆ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రచారం స్పీడ్ పెంచారు. ఏకంగా ఎనిమిది సభల్లో బుధవారం పాల్గొననున్నారు. జాన్సువాడ, జుక్కల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి ఆందోల్, నర్సాపూర్ సభల్లో ప్రసంగించనున్నారు. ఆపై సాయంత్రం తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments