Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగుడికి ఆపన్న హస్తం అందించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:41 IST)
దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి మాజీ ఎంపీ కవిత మూడు చక్రాల స్కూటీని అందించారు.

వినయ్ దీనావస్తపై ఇటీవల పత్రికలో వచ్చిన కథనానికి చలించిన ఆమె అతడితో నేరుగా మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
కోరుట్లో బీమునిదిబ్బ పోచమ్మగుడి సమీపంలో ఉంటున్న బోగ గణేశ్ సువర్ణ దంపతుల కుమారుడు వినయ్ చిన్ననాటి నుంచి చదువుల్లో రాణించి మంచి ర్యాంకులు సాధించాడు. హైదరాబాద్ లోని ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తిచేశాడు. ఇంటికి వచ్చిన వినయ్ తన అక్కను వారింట్లో దింపడానికి వెళ్లి వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు.
 
వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించగా రూ.18 లక్షలు వరకు ఖర్చు అయ్యాయి. అయినా పరిస్థితి మెరుగుపడక పోవడంతో 6 ఏండ్లుగా వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. వినయ్ పరిస్థితిని గమనించి సాయం అందించిన మాజీ ఎంపీ కవితకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments