కేసీఆర్‌పై ఫైర్ అయిన కేఏపాల్... మహిళలను రాష్ట్రపతి ఎంపికపై హర్షం

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (20:55 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేఏపాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌‌కు ఫిర్యాదు చేసినట్లు పాల్ చెప్పారు. 
 
ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌తో సమావేశం అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన రీతిలో ఫిర్యాదు ఇవ్వలేదని, అందువల్లే సీబీఐ వారిపై చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. 
 
యాదగిరిగిగుట్ట నిర్మాణం విషయంలో అవినీతి చోటుచేసుకుందని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు పాల్​ తెలిపారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రూ.లక్షా ఐదు వేలకోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదులో తెలిపినట్లు వివరించారు పాల్​. 
 
ఇక గతంలో తనపై జరిగిన దాడి విషయంలో ఇంకా ఎందుకు అరెస్టులు జరగలేదని ప్రశ్నించానని పాల్ అన్నారు. అలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను ప్రకటించడం సంతోషకరమని పాల్​ అన్నారు. 
 
తాను మొదటి నుండి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీకి చెప్పానన్నారు. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిగా వద్దని ఇదివరకే సూచించానని కేఏ పాల్ చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments