Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ MLCగా కవిత.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (18:51 IST)
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఉన్నారు. 
 
ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల‌ స్థానిక సంస్థ‌ల నుంచి ఏక‌గ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. సీఎం కేసీఆర్‌కు మ‌రోసారి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 
 
ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన క‌విత‌.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి సీ నారాయ‌ణ‌రెడ్డి నుంచి ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకున్నారు.
 
అనంత‌రం మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో క‌లిసి క‌విత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 
 
అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ ‌జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ క‌విత ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments