హమ్మయ్య! కేసీఆర్ కనిపించారు!!

Webdunia
శనివారం, 11 జులై 2020 (20:34 IST)
ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాల నడుము రెండు వారాలుగా ఎర్రబెల్లి ఫాంహౌస్ లో వుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు శనివారం ప్రగతి భవన్ వచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కనబడలేదనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

అంతేకాదు ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్‌లోకి దూసుకుపోయి ‘‘సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ ఇంగ్లీష్‌లో రాసిన ప్లకార్డును ప్రదర్శించి వెళ్లిపోయారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ తీన్మార్‌ మల్లన్న (నవీన్) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

‘‘ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఏదైనా తెలియజేయాలనుకుంటే, సంబంధిత యంత్రాంగం సరైన సమయానికి తెలియజేస్తుంది’’అని సీజే రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యానించారు. రాజకీయపరమైన గిమ్మిక్కులు ఉన్నందువల్లే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతించలేదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

తర్వాతి కథనం
Show comments