Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి కొండా రాజీనామా... త్వరలో బీజేపీ తీర్థం

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (17:40 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బతగింది. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా విషయమై తన అనుచరులకు సమాచారం ఇచ్చారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. 
 
పైగా, ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు అనుచరులకు సమాచరం చేరవేశారు. నిజానికి గత ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరాలని భావిస్తూ వచ్చారు. ఆ ఊహాగానాలకు నేటితో తెరపడినట్లు అయ్యింది. 
 
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి చేవెళ్ల నుంచి పోటీ చేయగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 
 
అధికార పార్టీ టీఆర్ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యమని పలు వేదికలపై ప్రకటించిన ఆయన.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై తనదైన శైలిలో నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో ముందుంటారు. తెలంగాణ రాజకీయాల్లో కొండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments