వేరే వారితో వివాహం.. లేటు వయసులో ప్రేమ జంట ఆత్మహత్య

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:55 IST)
కర్నూలు జిల్లా శ్రీశైలంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీశైలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నీలం సంజీవరెడ్డి సత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రేమ జంట. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఇసప్పాలెంకు చెందిన నాగలక్ష్మి (48) మృతి భర్త, వెంకట కాళేశ్వర రావు (50) గా గుర్తించారు పోలీసులు.
 
ఆత్మహత్యాయత్నం చేసిన వారినే సున్నిపెంట ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా దారిలోనే మృతి చెందారు. ఇద్దరికీ వేరే వారితో వివాహం కాగా పెళ్లి కాక ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వేర్వేరు వారితో పెళ్లయిన తరువాత విడిపోయింది ఈ ప్రేమ జంట. 
 
ఈ మధ్యనే ఇద్దరు కాంటాక్ట్‌లోకి వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే కలసి జీవించలేమని ఆత్మహత్యకు పాల్పడ్డారు నాగలక్ష్మి, వెంకట కాళేశ్వర్ రావు. ఇక ఈ ఆత్మహత్యపై బంధువులకు సమాచారమిచ్చారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Varma: పదహారేళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర

తర్వాతి కథనం
Show comments