Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో ఒకే కొమ్మకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (17:12 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట చెట్టు ఒకే కొమ్మకు ఉరేసుకున్నారు. ఎంతోకాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట.. ఏం కష్టమొచ్చిందో ఏమోగానీ... ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఓ యువతీ యువకుడి మృతదేహాలు వేలాడుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. వారిద్దరూ ఒకే కొమ్మకు ఉరేసుకుని వుండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే పోలీసులు స్థానికులతో కలిసివచ్చి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను కిందికి దించారు. ఆ తర్వా పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఈ ప్రేమ జంట వివరాలు తెలిశాయి. 
 
ఈ మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్, లక్ష్మిలుగా గుర్తించారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments