Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి సంవత్సరమే, ప్రియుడి కోసం ఇంట్లో బంగారు, వెండి దొంగతనం

Webdunia
గురువారం, 27 మే 2021 (19:04 IST)
ప్రియుడితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భర్త ఇంట్లోనే చోరీ చేసిన ప్రియురాలి ఉదంతాన్ని ఖమ్మం పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త ఇంటి నుంచే బంగారు, వెండి నగలను దొంగిలించి నగదుగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన భర్త, పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు చాకచక్యంగా వారి నుంచి 63 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
ఖమ్మం నగరానికి చెందిన జ్యోతి అనే యువతికి అశోక్ అనే వ్యక్తితో సంవత్సరం క్రితమే వివాహమైంది. అయితే వివాహితకు వివాహానికి ముందే శివ అనే వ్యక్తితో సంబంధం ఉంది. వివాహమైన తరువాత కూడా రహస్యంగా ఇది కొనసాగుతూ వచ్చింది. అయితే పెళ్ళైన తరువాత ప్రియుడితోనే ఉండిపోవాలనుకుంది.
 
అందుకు డబ్బులు అవసరం కాగా భర్త ఇంటిలోనే స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి ఇంటిలోని బంగారు, వెండి, ల్యాప్‌ట్యాప్‌లను దొంగిలించింది. ఏమీ ఎరుగనట్లు దొంగతనం జరిగినట్లు పోలీసులకు చెప్పింది. జ్యోతిపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments