మాట్రిమోనీ మోసగాడు అరెస్ట్, పెళ్లి చేస్తానని రూ. 2 లక్షల మోసం

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (20:32 IST)
మాట్రిమోనీ సైట్‌ని వాడుకుని ఒక యువతిని మోసం చేసాడు ఫిజియో థెర‌పి విద్యార్థి బాణోత్ సాయినాథ్. ఖ‌మ్మంకి చెందిన సాయినాథ్‌ని రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంత‌కీ సాయినాథ్ ఏం చేసాడంటే... మాట్రిమోనీలో పెట్టిన అమ్మాయి ప్రొఫైల్ నుండి బాధితురాలి ఫోటోలు మ‌రియు ఫోన్ నెంబ‌ర్ తీసుకుని వాట్సాప్ ద్వారా త‌న పేరు అవినాష్ రెడ్డి అని చెప్పి చాట్ చేసాడు. 
 
కొన్నాళ్ల స్నేహం త‌ర్వాత‌ పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెను న‌మ్మించాడు. ఇలా.. మాయ‌మాట‌లు చెప్పి బాధితురాలు నుండి రూ. 2.8 ల‌క్ష‌లు తీసుకున్నాడు. బాధితురాలు మ‌లేషియాలో ఐటీ జాబ్ చేస్తుంది. ఈమెతో పాటు మ‌రి కొంతమంది ఇత‌ర రాష్ట్రాల అమ్మాయిల‌ని కూడా డాక్ట‌ర్ సాయినాథ్ పేరుతో మోసం చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డ‌య్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments