Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీకి వెళుతున్నాని వ్యవసాయ బావిలో శవమై తేలిన మెడికో

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (18:02 IST)
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామనికి చెందిన ఓ మెడికో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కనుపర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వంశీ కాలేజీకి వెళుతున్నానంటూ శుక్రవారం బయటకు వెళ్లిన వ్యక్తి స్వంత వ్యవసాయ బావిలో శనివారం శవమై  కనిపించాడు. కాళ్ళూ చేతులు తాళ్లతో కట్టి వేసి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
 
వివరాలు చూస్తే... తుమ్మనపల్లి తిరుపతి - రమా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చిన్న కుమారుడైన వంశీ (22) ఖమ్మం జిల్లా మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన వంశీ శుక్రవారం సాయంత్రం ఖమ్మం బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. కానీ శనివారం గ్రామ శివారులోని వారి సొంత వ్యవసాయ భూమిలో శవమై తేలాడు. 
 
ఉదయం వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులకు బావిలో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా బోరున విలపించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం గ్రామంలో ఉన్న సిసి ఫుటేజీలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పరకాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments