Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 11న టీఆర్ఎస్ వందకు పైచిలుకు సీట్లతో గెలుస్తుంది.. కేటీఆర్

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (11:07 IST)
డిసెంబర్ 11న తెలంగాణ రాష్ట్ర సమితి వంద పైచిలుకు సీట్లతో గెలుస్తుందని.. మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చాలా శక్తివంతంగా తిరిగి వస్తుందని.. హైదరాబాద్‌ను ఇంకా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. మిగిలిన నగరాలతో పోల్చితే హైదరాబాద్ మార్కెట్ చాలా ఎక్కువగా వుందని మంత్రి తెలిపారు. రానున్న ఐదేళ్లలో రూ.50వేల కోట్లతో హైదరాబాదును అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 
 
ఇప్పటికే 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యిందని.. త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతోందని స్పష్టం చేశారు. 58 ఏళలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు 20 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందిస్తే.. కేవలం నాలుగేళ్లలో టీఆర్ఎస్ సర్కారు కాళేస్వరం ప్రాజెక్టు ద్వారా 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిందని తెలిపారు. 
 
వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేశామన్నారు. ఉప్పల్ వైపు నిర్మాణ రంగం కొత్త పుంతలుతొక్కుతుందని.. మెట్రో ఏర్పాటు వల్ల నగరంలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. సీమాంధ్ర స్నేహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ అందరికి భద్రత నిచ్చే నగరమని.. మినీ ఇండియా అని కేటీఆర్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments