Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం.. 6 సీట్లూ అధికార పార్టీకే...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 10వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో అధికార తెరాస తరపున పోటీ చేసిన అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణలు విజయభేరీ మోగించారు. 
 
ఈ స్థానంలో మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లలేదు. మిగిలిన వాటిలో భానుప్రసాద్‌కు 584 ఓట్లువచ్చాయి. అలాగే, ఎల్. రమణకు 479 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు అభర్థులు విజయభేరీ మోగించారు.
 
మరోవైపు, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు ఇప్పటికే విజయభేరీ మోగించారు. దీంతో ఎన్నికలు జరిగిన మొత్తం ఆరు స్థానాల్లో అధికార తెరాస అభ్యర్థులు గెలిచినట్టు అయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega 158: మెగాస్టార్ చిరంజీవి.. మెగా158 రిలీజ్ డేట్ మారనుందా?

Irumudi Review: రవితేజ కట్టుకున్న ఇరుముడి కోరికలు తీర్చిందా.? లేదా? ఇరుముడి రివ్యూ

ధనుష్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటాను : జీవీ ప్రకాష్

The Red Bag' Movie Review: మాతృప్రేమ,స్త్రీ శక్తిని చాటే చిత్రంగా ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ:

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

తర్వాతి కథనం
Show comments