Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్ క్రీమ్ కోసం ఫ్రిజ్ తెరిచిన చిన్నారి మృత్యువాత.. ఎలా?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (08:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లో విషాదం జరిగింది. ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి ఒకరు మృత్యువాత పడింది. ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ క్రీమ్‌ను తీసుకునేందుకు డోర్ తీయగానే ఆమెకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని నందిపేట్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటకు చెందిన గూడూరు రాజశేఖర్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి నందీపేట్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళుతుండగా, కుమార్తె రిషిత (4)ఐస్ క్రీమ్ కావాలని మారాం చేసింది. దీంతో స్థానికంగా ఉండే ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. 
 
తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకుంది. విద్యుదాఘాతానికి గురై అలానే బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments