మాదన్నపేట మండి... చినుకు పడితే చిత్తడి

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (15:31 IST)
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద కూరగాయల మార్కెట్‌లలో ఒకటైన మాదన్నపేట మండి చినుకుపడితే చాలు చిత్తడిగా మారిపోతుంది. చిన్నపాటి వర్షానికే మార్కెట్‌లో అడుగు తీసి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. శివారులోని రంగారెడ్డి జిల్లా నుండి సుమారు 30 గ్రామాలకు చెందిన వందలాది రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు మాదన్నపేట మండికి చేరుకుంటారు.
 
నిత్యం వేల సంఖ్యలో వినియోగదారులు ఈ మండికి కొనుగోళ్ల కోసం వస్తారు. రైతులు, వినియోగదారుల రాకపోకలతో మాదన్నపేట మండి నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటిది రెండు రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షానికి మండి ఆవరణ మురుగు జలాశయంలా మారింది. మార్కెట్లో వర్షం నీరు బయటికి వెళ్ళే మార్గం లేక మండి మొత్తం బురదమయంగా మారింది. మార్కెట్ లోకి వెళ్లివచ్చే వీలులేక వినియోగదారులు తగ్గిపోయారు. 
 
కానీ కష్టించి పండించిన పంటను వర్షంలోనూ వ్యయప్రయాసలకు ఓర్చి మాదన్నపేట మండికి తీసుకువస్తే కొనేవారు లేక విలువైన పంటను వర్షం నీరు, బురదలోనే పడేసి వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండిలో అమ్మకం పన్నులు చెల్లిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించరా అని మార్కెటింగ్ అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిహెచ్ ఎంసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు స్పందించి మాదన్నపేట మండి కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

Adivi Sesh: డెకాయిట్ ఇద్దరు దర్శకులా ! అందుకే రెండు సార్లు షూట్ చేస్తున్నారా !

Rashmika: గద్దర్ అవార్డ్ రావడం సంతోషం, ఇది ఆరంభం మాత్రమే : రష్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

తర్వాతి కథనం
Show comments