Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరు బావిలో బాలుడు మృతిపై హెచ్ఆర్సిలో పిటిషన్

Webdunia
గురువారం, 28 మే 2020 (21:35 IST)
మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం పోడ్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు వర్ధన్ బోరు బావిలో పడి చనిపోయిన ఘటనలో రెవెన్యూ శాఖ అధికారులను బాధ్యులను చేయాలని బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ హెచ్ఆర్సిలో పిటిషన్ దాఖలు చేసింది.
 
బోరు బావుల్లో పిల్లలు పడటం, యంత్రాంగం అంతా చేరి పిల్లలను పైకి తీసే ప్రయత్నం చేయడం, చివరకు పిల్లల శవాలే పైకి తేవడం ప్రహసనంగా మారిందని బోరు బావికి అనుమతి ఇచ్చే అధికారులు కేవలం డబ్బు కక్కుర్తితో ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇచ్చి ఆ బోర్ విఫలమైతే దానిని వెంటనే మూసి వేయడానికి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు.
 
పనికిరాని బోరుబావులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని బోరు బావి వేసే రిగ్ యజమానులు సైతం నిరర్థక బోరు బావుల మూసివేతలో విఫలమౌతున్నారని వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడం లేదని మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మృతి చెందిన బాలుడి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments