Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో బుల్లితెర నటుడి వీరంగం.. మహిళలపై దౌర్జన్యం!

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:19 IST)
'కోయిలమ్మ' సీరియల్‌లో హీరోగా నటించిన బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ హద్దులు దాటాడు. మద్యంమత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పైగా, ఆ మహిళల ఇంటికి వెళ్లి వేధించడం గమనార్హం. 
 
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడు. సమీర్‌తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
 
కాగా, ఐదు లక్షల రూపాయిలు నగదు అప్పుగా తీసుకుని.. డబ్బులివ్వమని అడిగితే రౌడీయిజం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో బాధితల మహిళలు పేర్కొన్నారు. సమీర్‌ నుంచి తమకు ప్రాణహానీ ఉందని మహిళలు పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళలిద్దరూ తమ దగ్గర సమీర్ డబ్బులు తీసుకున్నాడని చెబుతుండగా ఆయన మాత్రం మరోలా చెబుతున్నాడు.
 
అసలు ఈ వివాదానికి గల కారణాలను పరిశీలిస్తే, మణికొండలో శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ అనే ముగ్గురు మహిళలు కలిసి బోటిక్ వ్యాపారం నిర్వహించేవారు. కొన్ని కారణాలవల్ల స్వాతి ఆ వ్యాపారం నుంచి తప్పుకుంది. స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు తిరిగి ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి సమీర్‌తో కలిసి స్వాతి.. శ్రీవిద్య ఇంటికి వెళ్లింది. 
 
శ్రీవిద్య ఇంట్లో మాటా మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో శ్రీవిద్య, లక్ష్మీపై దౌర్జన్యానికి దిగాడు. అంతేకాదు ఆయనతో పాటు ఉన్న మిత్రులు కూడా ఆ మహిళలపై దాడికి తెగబడేంత పనిచేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments