Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంత్ కిషోర్‌తో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ చర్చలు

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్ గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ చర్చలు ఆదివారం కూడా జరుగుతున్నాయి. ఇందులో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూలంకుశంగా చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస విజయావకాశాలపై వారు చర్చిస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 
 
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి. ఆ రాత్రికి ప్రగతి భవన్‌లోనే బస చేసిన ప్రశాంత్ కిషోర్ ఆదివారం ఉదయం కూడా సీఎం కేసీఆర్‌తో మరో దఫా చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల కోసం తెరాసతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై తన బృందంతో సర్వే చేయించారు. 
 
ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను ఆయన సీఎం కేసీఆర్‌‍కు అందించారు. ఆ తర్వా 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. పైగా, సీఎం కేసీఆర్‌తో ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పని చేస్తానని ఈ సందర్భంగా పీకే స్పష్టం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments