తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ - చార్జీల పెంపునకు రంగం సిద్ధం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (12:48 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త విద్యుత్ టారిఫ్‌లను విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు ప్రతిపాదించి ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మరుక్షణమే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. 
 
తాజాగా చేసిన ప్రతిపాదనల మేరకు... గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య వినియోగదారులపై ఒక్క రూపాయి చొప్పున పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించింది. 
 
తెలంగాణాలోని విద్యుత్ డిస్కంలు దాదాపు 10 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. ఈ నష్టంలో కొంతైనా భర్తీ చేసుకునేందుకు వీలుగా ఇపుడు విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమైందని విద్యుత్ అధికారులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments