Webdunia - Bharat's app for daily news and videos

Install App

PK టీమ్‌తో KCR భేటీ: మూడోసారి అధికారం కోసం కసరత్తు

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (18:15 IST)
దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్(పీకే)తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పీకే టీమ్‌తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీకేతో కేసీఆర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణలో వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో పీకే టీమ్‌ సేవలు పూర్తిస్థాయిలో పొందే యోచనలో ఉన్నట్లు సమాచారం. 
 
దీంతో పాటు ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేయించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ యంత్రాంగం, నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాలని అనుకుంటున్నట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానం పీకే టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆర్భాటంగా పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సైతం పీకే టీమ్ సేవలు అందిస్తుండటం విశేషం. పీకే టీమ్‌లో క్రియాశీలకంగా ఉండే ప్రియా రాజేంద్రన్.. షర్మిల పార్టీ కోసం వ్యూహాలను రచిస్తున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా ప్రియ రాజేంద్రన్ అనేక సలహాలను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments