Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన చదువు తండ్రికి భారం కాకూడదని ఐశ్వర్య ఆత్మహత్య, సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (18:56 IST)
లాక్ డౌన్ సమయంలో హాస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చెయ్యమనడంతో మనస్థాపానికి గురైన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన చదువు తండ్రికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఐశ్వర్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
ఈ విషయం చాలామందిని కదలించింది. దీనిపై స్పందిచిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ విచారకర సందర్భంలో ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపాన్ని తెలుపుకుంటున్నానని పోస్ట్ చేశారు. బీజేపీ అనాలోచితంగా రద్దు చేసిన నోట్లు, లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా పలు కుటుంబాలను నాశనం చేసిందని తెలిపారు.
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ఐశ్వర్య ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. పైచదువుల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ శ్రీరామ డిగ్రీ కాలేజీలో చదువుతూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంది.
 
అయితే కరోనా కారణంగా తను ఉంటున్న హాస్టల్ యాజమాన్యం ఖాళీ చెయ్యమనడంతో కోవిడ్ నేపథ్యంలో తన కుటుంబానికి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్య తన కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments