Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ- గులాబీ నేత‌ల‌ను ఎందుకు పట్టించుకోరు..?

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (16:52 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
అక్రమార్కులపై ఉక్కుపాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవ‌న్నారు రేవంత్‌. గులాబీ నేత‌ల‌ అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. ఇదంతా మీకు చేత‌కాకనా.. లేక అందులో వాటాలు ఏమైనా ఉన్నాయా? అని నిల‌దీశారు.
 
జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు రేవంత్. అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశార‌ని.. ఇది అంత ఆషామాషీ విషయమా? అంటూ కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు.  
 
దేవరయాంజల్ 437 సర్వే నెంబర్‌లో మీ కుటుంబమే దేవాలయ భూమిని ఆక్రమించి పత్రికలు నడుపుతున్నార‌ని కేటీఆర్‌కు గుర్తు చేశారు రేవంత్‌. ఇలా గ్రేటర్‌లో గులాబీ నేత‌ల క‌బ్జాలు కోకొల్ల‌ల‌ని వివ‌రించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments