Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రష్టు పట్టించారు కదరా.. మాజీ మంత్రి డాక్టర్ పి శంకర్ రావు ఆవేదన

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (22:25 IST)
కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తామంటే పట్టించుకోలేదు.. కానీ ఈ రోజు పార్టీ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు కదరా భ్రష్టులారా.. ఇదెక్కడి న్యాయం షాద్ నగర్ పేరు వింటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకు రావాలి.

కానీ నేడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని భ్రష్టు పట్టించి నేడు వేడుక చూస్తున్న నేతలరా పార్టీ పతనావస్థకు చేరుకుంటే నేను చూడలేను ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షాద్ నగర్ మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డాక్టర్ పి. శంకర్ రావు చలించిపోయారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో రెండు సీట్లు రావడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకున్నదని ఈ సందర్భంలో ఆయన ప్రశ్నించారు. పైసల కోసం పార్టీని వాడుకొని పైసలు సంపాదించుకొని తరువాత పార్టీనీ నిర్దాక్షిణ్యంగా వదిలి పోయిన నాయకులు దీనికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అభివృద్ధి చేస్తానంటే కొంతమంది స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను దూరం పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదనీ, షాద్ నగర్ నియోజకవర్గంను తన చేతిలో పెడితే నియోజకవర్గానికి బంగారు భవిష్యత్తును చూపిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి పూర్వవైభవం రావాలంటే తనలాంటి వారు చాలా అవసరమని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments