టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసు - 40 మందికి సిట్ నోటీసులు

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (08:39 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన గ్రూపు-1 పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న వారిలో తొమ్మిది మందిని అరెస్టు చేసింది. అయితే, లీక్ కేసులోని నిందితురాలు రేణుక కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి 40 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బందికి సిట్ నోటీసులు జారీచేసింది. వారిలో ఇప్పటికే పది మందికి గ్రూపు-1 పోటీ పరీక్షలు రాసినట్టు తేలింది. గ్రూపు-1 పరీక్షలు రాసినవారితోపాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా ఈ నోటీసులు జారీచేసింది. 
 
కాగా, లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తుంది. ప్రశ్నపత్రం గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ మాట్లాడినట్టు సిట్ అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో రేణుక కాల్ డేటా ఇపుడు కీలకంగా మారింది. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తుంది. దీంతో ఈ పేపర్ లీకేజీ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ఆసక్తిగా సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments