Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరు జారిన ఈటల : హుజురాబాద్‌లో ఎగరబోయేది గులాబి జెండానే...

Webdunia
ఆదివారం, 20 జూన్ 2021 (14:52 IST)
ఇటీవల తెరాస నుంచి బీజేపీలో చేరిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోరు జారారు. తాను రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఎగిరేది గులాబీ జెండానే అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను తప్పు మాట్లాడినట్టు తెలుసుకుని, కాషాయం జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. 
 
సాధారణంగా దశాబ్దాలుగా ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినపుడు రాజకీయ నేతలు అలవాటులో పొరపాటుగా నోరు జారడం, ఆపై నాలుక కరుచుకోవడం సహజమే. అలాగే, ఈటల రాజేందర్ కూడా తాజాగా పొరబడ్డారు. 
 
తన మాతృపార్టీ తెరాసను వీడి ఆయన బీజేపీలో చేరారు. ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.
 
సాధారణంగా పార్టీ మారిన కొత్తలో నేతలు నోరు జారుతుండడం సహజమే. అలాగే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా పొరపాటున నోరు జారారు. హుజురాబాద్‌లో ఎగరబోయేది గులాబి జెండా అని అనేశారు. 
 
అంతలోనే తన పొరపాటును గుర్తించి కాషాయ జెండా ఎగరబోతోందని సవరించారు. ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు.
 
ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవం కూడా ముఖ్యమని… కులమతాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే అని స్పష్టంచేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాముల దూరినట్లు తనపై ఓ మంత్రి మాట్లాడటం వాళ్ల సంస్కారానికి నిదర్శనమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments