కుక్క పిల్లలపై పంజా విసిరిన నాగుపాము

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:41 IST)
నాగుపాము కాటుకు రెండు కుక్క పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి. నిద్రిస్తున్న కుక్క పిల్లలను చుట్టుముట్టిన పాము.. బుసలు కొడుతూ కుక్క పిల్లలపై పంజా విసిరింది. దీంతో రెండు కుక్క పిల్లలు స్పాట్‌లోనే చనిపోయాయి.

ఎల్‌బీనగర్‌లోని నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. తన పిల్లలకు అపాయం తలపెడుతుందన్న విషయం తెలుసుకున్న తల్లి కుక్క.. ఘటనా స్థలానికి చేరుకుని అరవడం మొలుపెట్టింది.

గట్టిగా అరుస్తూ పామును తరిమేందుకు ప్రయత్నించింది. కానీ ఆ నాగుపాము అదరలేదు. బెదరలేదు. పైగా తల్లి కుక్క అరుస్తుండగానే కుక్క పిల్లలను బుసలు కొడుతూ కాటేసింది. దీంతో తన పిల్లలు కళ్లెదుటే చనిపోతుండడాన్ని చూసి తల్లి కుక్క తల్లడిల్లిపోయింది.

చాలా సేపు కుక్క అరవడంతో ఆ పాము అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. ఈ దృశ్యాలు సెల్‌ ఫోన్లలో రికార్డు చేశారు స్థానికులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

Aishwarya Rajesh: పేరుకు సుకుమారి కానీ టచ్ చేస్తే విద్యుత్ షాకే.. ఓ..! సుకుమారి టీజర్

తర్వాతి కథనం
Show comments