Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ, వాళ్లు నాపై అత్యాచారం చేయలేదు, 36 మంది మాత్రం: మిర్యాలగూడ యువతి

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:50 IST)
తనపై 139 మంది అత్యాచారం చేశారని సంచలన ఆరోపణలు చేసిన మిర్యాలగూడ బాధిత యువతి యు-టర్న్ తీసుకున్నది. తనపై ఎవరూ అత్యాచారం చేయలేదని, డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఐతే మళ్లీ మరోసారి మీడియా ముందుకు వచ్చింది.
 
సోమవారం నాడు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్‌లో ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ అధ్యక్షతన పలు ప్రజాసంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తనపై 139 మంది అత్యాచారం అంతా అబద్ధం, రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బోయ్ తనను చంపుతానని బెదిరించడం వల్ల అతడు చెప్పినట్లు చెప్పానని తెలిపింది. అంతేకాదు.. తనను అత్యాచారం చేసినట్లు పలువురు మీద నిందారోపణలు చేశాననీ, వారికి ఇబ్బంది కలిగించానని, వారికి మీడియా ద్వారా క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించింది. 
 
ఐతే తనపై 36 మంది అత్యాచారం చేశారని వెల్లడించింది. వారి పేర్లను పోలీసులకు అందించినట్లు తెలిపింది. తను ఉద్యోగం ద్వారా డాలర్ బోయ్ పరిచయమయ్యాడనీ, తనకంటే ముందే ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకున్నాడని చెప్పింది.
 
గతంలో తన మాట వినని వారిని ఎలా చంపాడో తెలుపుతూ వుండే ఫోటోలను తనకు చూపించి, అలాగే తనను కూడా చంపేస్తానని బెదిరించడంతో మరో మార్గం లేక ఇలా చెప్పానని వెల్లడించింది. డాలర్ బోయ్ ను శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. అనంతరం ప్రజాసంఘాల నాయకులు కూడా యువతిని బెదిరించి, అఘాయిత్యాలకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని, కేసును సీఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments