పుల్వామా ఘటన అమానుషం.. అమరుల కుటుంబానికి రూ.25లక్షలు

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:43 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా సాధారణ పరిపాలన శాఖతో పాటు ఆర్థిక శాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కేబినెట్ ఏర్పాటు ఆలస్యం కావడంతో పద్దుల లెక్కలన్నీ కేసీఆరే చూసుకుంటున్నారు.. దీంతో బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. 
 
ఈ బడ్జెట్‌లో భాగంగా ఒక్కో అమరుల కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ వెల్లడించారు. ఈ పాశవిక చర్యను తెలంగాణ అసెంబ్లీ ఖండిస్తోందంటూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
పుల్వామాలో జరిగిన దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ఆయన సంతాపం తెలిపారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన సంచలనాత్మకం : రావు బహదూర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

Prabhas: ప్రభాస్ లాంచ్ చేసిన వరుణ్ తేజ... కొరియన్ కనకరాజు టీజర్‌

Jani Master: మా మధ్య గొడవలు లేవు, డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళం : జానీ మాస్టర్

తర్వాతి కథనం
Show comments