Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (18:43 IST)
తెలంగాణ రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. గురువారం నుంచి రుణమాఫీ చేయనున్నట్టు వెల్లడించారు. రుణమాఫీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులతో పాటు ఇతర అధికారులతో ఆయన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఇటీవల ప్రకటించిన రైతు రుణమాఫీపై చర్చించారు. 
 
ముఖ్యంగా, గత 2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, కొంతమేర రుణాలు మాఫీ చేశామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. కరోనా లాంటి ఉపద్రవంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆర్థిక వెసులుబాటు లేక రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడినందున రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments