Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్వాలలో సూదిని మింగిన పరశురాముడు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:58 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా అనంతపురం గ్రామంలో పరశురాముడు అనే యువ‌కుడు సూదిని మింగాడు. పశువులకు ఇంజెక్షన్లు వేసేందుకు వినియోగించే సూదిని నోట్లో పెట్టుకునివుండగా, అది కాస్త పొరపాటున ఒక్కసారిగా గొంతులోకి చేరి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. 
 
దీంతో ఆ యువకుడు గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, విపరీతమైన దగ్గుతో బాధ‌ప‌డ్డాడు. అయితే అతడి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంట‌నే అత‌డిని కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 
 
వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు అత్యాధునిక టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా ఆ సూదిని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన ప‌ద్ధ‌తి ద్వారా ఆ సూదిని తొల‌గించామ‌ని వైద్యులు చెప్పడంతో పరశురాముడు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments