Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండికి హైకోర్టులో ఊరట.. రిమాండ్ రిపోర్టు కొట్టివేత.. బెయిల్

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (17:04 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసన జీవో 317ను రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన కరీంనగర్‌లోని జాగరణ దీక్ష తలపెట్టారు. దీనికి కరీంనగర్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన నివాసంలోనే దీక్షకు దిగేందుకు పూనుకున్నారు. 
 
అయితే, కరీంనగర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే, కింది కోర్టు జారీచేసిన రిమాండ్ రిపోర్టును కొట్టివేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments