Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన తెలుగు టెక్కీలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2022 (08:57 IST)
వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టెక్కీలు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్య సంపత్, రాజమండ్రికి చెందిన మోరంపూడి సూయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీద్ర అనే వారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరింతా గత కొన్ని నెలలుగా రాజమండ్రిలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. 
 
దీంతో ఈ నెల 25వ తేదీన గోవాలోని ఓ వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ (25 మాత్రలు), ఎల్ఎస్డీ (2స్ట్రిప్పులు) కొనుగోలు చేసి బస్సులో గోవా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కి రాజమండ్రికి చేరుకునేలా ప్లాన్ చేశారు. 
 
అయితే, వీరివద్ద డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు నిఘా వేసి ఈ ఇద్దరు టెక్కీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments