Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోచారం శ్రీనివాస రెడ్డికి మరోమారు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (08:54 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి మరోమారు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలో ఉన్నప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది. ఈయనకు కొన్ని నెలల కిందటే కోరనా వైరస్ సోకింది. అపుడు కూడా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇపుడు మరోమారు ఆయనకు పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే, వైద్యులు మాత్రం పోచారం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క కూడా ఈ కరోనా బాధితుల్లో చేరారు. ప్రస్తుతం ఈయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆదివారం తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలో కొత్తగా 2047మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1174 కేసులు నమోదు కాదా. వీటిలో మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 178 మంది ఈ వైరస్ బారినపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments