Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం నుంచి వారం రోజుల పాటు తెలంగాణ నిప్పుల కొలిమే...

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (09:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు ఎండలు మండిపోనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వారం రోజుల పాటు ఎండలు నిప్పుల కొలిమిగా మారనుంది. ఈ వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని పేర్కొంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 44 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments