Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు : వివాదం - ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం తలెత్తింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల ప్రజలను నియంత్రించారు. 
 
బోధన్‌లో శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన మైనార్టీ నేతలు బైఠాయించి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. 
 
అయితే, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు తొలుత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలను కూడా మొహరించారు. ప్రస్తుతం బోధన్‌లో 144 సెక్షన్‌ను అమలు చేసి, ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments