Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటెలకు అన్నం పెట్టి అ.. ఆలు నేర్పింది సీఎం కేసీఆర్ : మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (11:43 IST)
తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసకు గుడ్‌బై చెప్పిన ఈటల ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈటల మాటల తూటాలు పేల్చుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెలకు అన్నం పెట్టి.. అ, ఆలు నేర్పింది కేసీఆర్ అని.. కానీ కేసీఆర్ బతికుండగానే ఈటెల సీఎం కావాలని ప్రయత్నించారని హరీష్ ఆరోపించారు. 
 
ఈటెల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈటెల సీఎం కావాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మాట్లాడినప్పుడు… ఆ వ్యాఖ్యలను ఈటల ఎందుకు ఖండించలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బతికుండగానే ఆయన పెట్టిన రైతుబంధు పథకం దండగ అని ఈటెల అన్నారని హరీష్ మండిపడ్డారు. 
 
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏ శక్తి కూడా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేదని చెప్పారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో 100 శాతం టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. 
 
కాగా టీఆర్ఎస్‌లో ఉన్నంత కాలం హరీష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఈటెలకు గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈటెలపై స్వయంగా హరీషే ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments