Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక : మంత్రి సబిత

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (14:16 IST)
మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక అని తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని తెలంగాణాలో మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎపుడూ కోరుకుంటారన్నారు. నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారన్నారు. అలాగే, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో వేసవి వస్తే నీళ్ల కోసం మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ఇపుడు ఇంటి వద్దే 24 గంటలు నీళ్లు వస్తున్నాయన్నారు. 
 
కేసీఆర్ ప్రభుత్వం కాలంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఎన్ఆర్ఐ వేధింబపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్.ఆర్.ఐ విభాగాన్ని ఏర్పాటు చేశారని, మహిళలకు ఆర్థిక భద్రత కోసం వడ్డీ లేకుండా రుణాలను తెరాస ప్రభుత్వం ఇస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments