టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆగస్టు 15న జన్మిస్తే...

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (13:18 IST)
ఈ నెల 15వ తేదీన 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశం యావత్తూ సిద్ధమవుతుంది. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఆగస్టు 15వ తేదీన జన్మించే శిశువులకు వాళ్లకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రకటించారు. 
 
అలాగే, 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. 75 ఏళ్లు పైబడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75 శాతం రాయితీపై మందులు అందించనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments