Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై సోషల్‌మీడియా వేదికగా హెచ్ఎం అవగాహన ... వెంకయ్య ఫిదా

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (12:54 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా అనేక రకాలైన ప్రచారాలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, సామాజిక మాధ్యమాలు వేదికగా వెబినార్లు, అవగాహన సదస్సులు నిర్వహిన్నారు. ఇలాంటి వారిలో ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డి ఒకరు. ఈయన ఇపుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నారు. 
 
కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న వేణుగోపాల్‌ రెడ్డి కరోనాపై నాలుగు నెలలుగా వేల మందికి అవగాహన కల్పించారు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ, వైరాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆయన కొవిడ్‌పై స్వయంగా అవగాహన తెచ్చుకున్నారు. 
 
తనకు తెలిసిన విజ్ఞానాన్ని పదిమందికి పంచాలని భావించి, సోషల్‌మీడియా ద్వారా వైరస్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ భరోసా నింపుతున్నారు. ఆయన రూపొందించిన వీడియోలు ఏపీలోనూ మంచి స్పందన వచ్చాయి. అక్కడి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వేణుగోపాల్‌రెడ్డితో వెబినార్లను సైతం నిర్వహించాయి. 
 
ఏపీ ప్రభుత్వం సైతం రెండు వెబినార్లను నిర్వహించింది. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్నారు. ఆయన చొరవకు ఫిదా అయిన వెంకయ్యనాయుడు శనివారం వేణుగోపాల్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అభినందించారు.
 
కరోనాపై మీరు చేస్తున్న కృషికి అభినందనలు.. ఇదే చొరవను కొనసాగించండి అంటూ ఉత్సాహం నింపారు. సాక్షాత్తు ఉపరాష్ట్రపతి నేరుగా ఫోన్‌చేసి మాట్లాడంతో సదరు ప్రధానోపధ్యాయుడు ఉబ్బితబ్బిబ్బులైపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments