Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎన్ని ప్రాణాలు బలైపోవాలి చెప్పండి? కేసీఆర్ పైన విజయశాంతి పైర్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:25 IST)
హైదరాబాద్ దీనదయాళ్ నగర్‌లో ఉన్న నాలాలో సుమేద అనే 12 ఏళ్ల విద్యార్థిని పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ కేసీఆర్ గారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు పోవాలో చెప్పండి అని ప్రశ్నించారు.
 
అభంశుభం తెలియని చిన్నారి జీవితం కరిగిపోయిందని చెప్పారు. విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా డ్రైనేజిలు, నాలాలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్కతీస్తే గిన్నిస్ రికార్డ్ అవుతుందని విమర్శించారు.
 
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని మాటలు చెప్పడం మామూలైపోయింది. పాత ప్రభుత్వాల వల్లే హైదరాబాదులో పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయని మీరు ఎన్నోసార్లు విమర్శించారు, మరి ఈ ఆరేళ్ల పాలనలో మీరు చేసిందేమిటని ఎద్దేవా చేశారు.
 
ఇప్పుడు ఇతర తెలంగాణ పట్టణాలు, నగరాలు కూడా హైదరాబాదుకు తోడవుతున్నాయని అడుగడుగునా కబ్జాలు అక్రమ కట్టడాలతో చినుకు పడితే చాలు ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments