Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండలో మహిళ దారుణ హత్య, పోలీసు స్టేషన్ దగ్గరలోనే జరిగిన దుర్ఘటన

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (12:48 IST)
హన్మకొండలో దారుణ హత్య జరిగింది. పోలీసు స్టేషను కూతవేటు దూరంలోనే ఈ  సంఘటన జరగడం అందర్ని ఆందోళనకు గురిచేస్తోంది. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో దోరం శారద అనే మహిళ కూరగాయలు విక్రయించుకుంటూ కుమారుడితో కలిసి జీవనం గడుపుతోంది. కొంత కాలం క్రితం భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న శారదను గుర్తు తెలియని అగంతకులు హతమార్చారు.
 
ఆమెతో పాటు ఆమె కుమారుడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారిపై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. శారద తలకు బలమైన గాయాలు కావడంతో శారద అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమారుడు అఖిలేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 
పోలీసు స్టేషనుకు అతి దగ్గర దూరంలో ఈ ఘటన జరగడంతో హన్మకొండలో విషయం చర్చాంశనీయంగా మారింది. వారిపై దాడికి తెగబడిన వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శారద కుమారుడు తీవ్ర గాయాల పాలై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో పోలీసులు అతడిని ఎంజీంఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికక్కడ చికిత్స జరుగుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments